25, సెప్టెంబర్ 2010, శనివారం

నలిమెల భాస్కర్ కు ఇండియన్ హైకు క్లబ్ ఉత్తమ నానీ పురస్కారం .అనకాపల్లి లో ....

నలిమెల భాస్కర్ కు ఇండియన్ హైకు క్లబ్ ఉత్తమ నానీ పురస్కారం .అనకాపల్లి లో ....

శ్రీకాకుళం కథానిలయం లో తెలంగాణా కవులు..

విజయనగరం లో గురజాడ ఇంటి ముందు ...

అరసవెల్లి సూర్య దేవాలయం లో

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

విద్రొహానికి విత్తనం సెప్టెంబర్ 17

నవంబర్ 1కు సెప్టెంబర్ 17 తల్లిలాంటిదే , మొదటిది తెలంగాణకు కటిక చీకటి రోజు అది 1956 ది. దీనిని కన్న తల్లే సెప్టెంబర్ 17 ,1948. హైదరాబాద్ ఒక స్వతంత్ర దేశాన్ని భారత దేశం దాడి చేసి కలుపుకున్నది. దీని వల్ల మాకేమి వచ్చింది .అప్పుడే పరాయి వాళ్ళం అయిపోయాము . అతరువాత తెలిసిందే అన్ద్రోల్లు తెలుగు తెలుగు అని తెగులు పట్టిచిండ్రు. భారత్ లో కలిపిన జాతీయత నే మాకు అన్ద్రోల్లకు పొత్తు పెట్టిచ్చింది .అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణాను నిట్ట నిలువు ముంచింది. అందుకే సెప్టెంబర్ 17 విద్రోహానికి ఇత్తునం పడ్డ రోజు.

13, సెప్టెంబర్ 2010, సోమవారం

సీమాంద్ర కవుల తెలంగాణా సంఘీభావం

తెలంగాణా ఉద్యమానికి సీమాంధ్రకవి మిత్రుల సంఘీభావానికి స్వాగతం .దోపిడీ,పీడన,ఆధిపత్యం ,ఎక్కడుంటే అక్కడ తన కలాన్ని కవి ఎక్కుపెడుతడు.కవికి ప్రాంతీయ బేదాలు ఉండవని నిరూపించారు చాలా మంది "కావడి కుండలు"కవితా సంకలనం ద్వార .వారందరికీ తెలంగాణా ప్రజల పక్షాన కృతజ్ఞతలు .ఈ పుస్తకానికి సంపదకం వహించిన కోయి కోటేశ్వర్ కు అభినందనలు. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నుంచి ఆంద్ర సామ్రాజ్య అగ్ర కుల దోపిడీ వలస వాదులు తెలంగాణాను సర్వ నాశనం చేసిండ్రు.నీళ్ళు,బొగ్గు,ఉద్యోగాలు,భూములు అన్నీ దోచుకున్న సంగతి అందరికి తెలుసు. మా భాష .సంస్కృతి కూడా పరీయికరణం చెందింది.అమెరిక లో రెడ్ ఇండియన్స్ లాగా ఇక్కడి పరిస్థితి ఉంది. ఈ స్థితిని అర్థం చేసికున్న సీమంద్ర కవులకు శనార్తి.