8, ఆగస్టు 2010, ఆదివారం

అవును... తెలంగాణా వొక దేశమే ......

సేమంద్ర మంత్రులకేమేరుక తెలంగాణా ఒక దేశం గానే వుండేది ఆతరువాత రాష్ట్రం అయ్యిందని .పందొమ్మిది వందల నలబై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు కు ముందు హైదరాబాద్ ఒక దేశం .దీనికి ఐక్య రాజ్య సమితి లో సబ్యత్వం కూడా వుండేది. ఆ తరువాత జవహర్ లాల్ నెహ్రు, పటేల్ ల వల్ల ఇండియన్ యునియన్ ల కలిసింది.ఈ దేశానికి రాయబార కార్యాలయాలు రక్షణ ,విమాన ,రవాణా,ఆర్ధిక, వ్యవస్థలు స్వతంత్రంగా ఉండేవి. అయితే ఇది ప్రజాస్వామికమైన పరిపాలన కాదు. ఫ్యూడల్ దొరలూ, పటేండ్లు రాజ్యం అండ తో ప్రజలను పీడించే వాళ్ళు.తరువాత హైదరాబాద్ రాష్ట్రం అయ్యింది. ఆంధ్ర భాష ప్రయుక్త కుట్రలకు బలి అయి పందొమ్మిది వందల యాబై ఆరు నవంబర్ వొకటి న ఆంధ్రప్రదేశ్ అయ్యింది. ఇది షరతులతో కూడిన కలయిక అప్పటినుంచి యాబై నాలుగేళ్ళ దోపిడీ పీడన పాలన నడస్తండి.ఇదివరుకున్న రాష్ట్రం కావల్నంటే ద్రోహం దేశ ద్రోహం అని మంత్రులే ఏకసేక్కేం చేస్తుండ్రు. అయితే ఇక నుంచి ఇదివరకున్నమా దేశమే కావాలనే డిమాండు చేస్తే వస్తే ఎట్లా ఎవలకు ఎరుక ?

3, ఆగస్టు 2010, మంగళవారం

బంతి పూల దండ

బలమైన విశ్వాసాన్ని నమ్మి దేని కైనా తెగించే తనం తెలంగాణా బిడ్డలది .మాయ మర్మం లేని ,వ్యక్తిగత అభివృద్ధి కోరుకొని ,వ్యాపార దృక్పథం లేనిదే తెలంగాణా మట్టి తత్వం .అందుకే ఇక్కడి బిడ్డలు కాలి పోతన్నారు .కడుపుల దుక్కం కుమ్మరిచి పోతాండ్రు .అమెరికా కలలు గన్న ఇషాన్ ఎట్లా దీపం వత్తి లాగా కాల్చుకొని బూడిదయ్యిండు.నిజానికి ఇషాన్ రెడ్డి మైసమ్మ మొక్కు తప్పు మొక్కుకున్నాడు .ఇంకో తీరు మొక్కనుండే. కొంత ఆవేదన కొంత సున్నిత మనస్తతత్వం కొంత ప్రతిక్రియత్మకత దృక్పథం కలే గలసి నేను అంటుకుంటే నన్న..... అనుకోని అమరుడై లోకాన్ని ఎడిపిచ్చిండు.ఈనాటి పిల్లలకు రేశం కోపం ఆవేశం ఉండాలే గని దాన్ని ఎక్కడ తీర్చుకోవల్నో అక్కడనే తీర్చుకోవలె .బిడ్డా ఇషాన్ నువ్వు తెలంగాణా సిగల బంతి పువ్వువు.