9, ఫిబ్రవరి 2014, ఆదివారం

బహు భాషల నలిమెల భాస్కర్

ఆయనను   చూస్తే  అప్సస్ అనిపిస్తది .ఎట్ల నేర్సిండు ఇన్ని భాషలు అని .ఒకటా రెండా పద్నాలుగు భారతీయ భాషలు గడ గడ మాట్లాడుతాడు .సర్ర సర్ర రాసుకపోతడు .మల్లా ఇండ్ల కెల్లి అన్డ్లకు ,అండ్ల కెల్లి ఇండ్లకు సక్కగ అనువాదం చేస్తడు.మనకు తెలిసి ఏడు ఎనిమిది భాషలు తెలిసినోల్లు ఉన్నరు.పివి సాబ్ సుత భాహు భాషా కోవిదుడు .ఇంక ఆయనకు విదేశీ భాషలు సుత వచ్చు .ఈ పద్నాలుగు భాషలు నేర్సుకున్న నలిమెల భాస్కర్ ది కరీంనగర్ .ఆయన అన్ని భాషల పుస్తకాలు పత్రికలు ఉంటయి .
                              మొదట తమిళం నేర్సుకున్నాడట .ఇగ తరువాత కన్నడం ,మలయాళం ,హిందీ ,ఉర్దూ ,పంజాబీ ,సంస్కృతం ,అస్సామీ ,బెంగాలి ,ఒరియా ,మరాటి ,ఆంగ్లం ,గుజరాతీ ,ఇన్ని భాషలు వచ్చు తెలుగు భాష మనదేనాయే .మొత్తం పద్నాలుగు ఇంకోటి తెలంగాణా కూడా మస్తు వచ్చు .తెలంగాణ తెలుగు వేరు వేరా అనిపించవచ్చు .అవును వేరు వేరే అని ఈ నలిమెల భాస్కరే తన ‘బాణం ‘వ్యాసాల ద్వార నిరూపించిండ్రు .ఎందుకంటే తెలంగాణా భాషల రాసిన నవలలు కేవలం తెలుగు పుస్తకాలు సదివేవాల్లకు సమాజ్ కావు . అయితే ఇన్ని భాషల పట్ల ప్రేమ ఎందుకు పెరిగింది అంటే ,తాను రైల్వే స్టేషన్ ఉన్న ఒక వూరిలో ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తుండగా ఆ రైల్వే బుక్ స్టాల్లో అన్ని భాషల చందమామ లు అన్ని భాషల రేపెదేక్స్ బుక్స్ చూసి పట్టు పట్టినట్టు చెప్పుతారు .ఇగ ఆ తెరువాత ఒక్కొకటి ఒక్కొక్కటి అన్ని భాషల అక్షరాలు సాహిత్యం వ్యాకరణం కథలు కవిత్వం అన్ని నమిలి మింగేసిండు .
            ఇట్లా అనువాదం లోకి వచ్చిండు గాని మొదలు ఆయన కవి రచయిత .1993 లో ‘నూరేల్ల పది ఉత్తమ మళయాళ కథలు ‘తెలుగులోకి అనువాదం చేసి పుస్తకం గా తెచ్చారు . ఇదే సంవత్సరం మలయాళం నుంచి ‘మనీమేకర్స్ ’నవల కన్నడం నుంఛి ‘కుండి ‘నవల తెలుగులోకి అనువదిన్చిండ్రు .  1996 లో ‘అద్దంలో గాందరి ‘ పేరుతో తమిళ మలయాళ మరాటి భాషలలోని పన్నెండు కథల పుస్తకం తెచ్చిండ్రు .1985 నుండి 2000 లలో తెలుగు లో వచ్చిన దళిత స్త్రీ వాద కవిత్వాన్ని తమిళంలో పుస్తకం వేసిండ్రు . 14 భారతీయ భాషలలలోని రచయితల పరిచయాన్ని ఆంధ్రజ్యోతి లో కాలం లో పరిచయం చేసి పుస్తకం గా వేసిండ్రు .ప్రజా సాహితీ లో ‘మట్టి కూడా మాట్లాడుతుంది ‘ కాలం రాసి పుస్తకం గా వేసిండ్రు .మలయాళ నవల ‘స్మారక శిలలు ‘అనువాదం అనువాదం సాహిత్య ఎకాడమి పుస్తకం గ వేసింది .ఇలా నలిమెల భాస్కర్ సర్ ఒక అనువాదాల ఖార్కనా .
                          ఇదంతా ఒక ఎత్తు తెలంగాణా భాషకు డిక్షనరీ తాయారు చేసుడు ఇంకొక ఎత్తు .ఆంద్ర –తెలంగాణా బలవంతంగ కలిపి ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణా భాషా సంస్కృతి చెప్పరానంత నష్ట పోయింది .అందులో తెలంగాణా పదాలు దాదాపుగా మరిచిపోయే దశ వచ్చింది .అప్పుడు ఆ లోటు ను తీర్చ ‘తెలంగాణా పదకోశం ‘తీసుకవచ్చిండ్రు .ఇప్పుడు మరిన్ని పదాలతో సరి కొత్తగా వస్తుంది.

                             అనువాదం లేకపోతే దేశ దేశాల కవిత్వం సాహిత్యం మనం చదువక పోవచ్చు కాని ఇదొక పరిశ్రమ .నలిమెల భాస్కర్ ఇన్ని భాషలు తెలిసి మన సాహిత్యాన్ని ఇతరులకు అక్కడి సాహిత్యాన్ని మనకు అందిస్తున్నారు .చిన్నగా భాషల మీద ఇంట్రస్ట్ బహుభాషా వేత్తను చేసింది .భాషల పట్ల ప్రేమ ఇన్ని భాషల మన భాస్కర్ గురించి అంతర్జాల పాట కులకు తెలువాలేనని  ఈ తొవ్వలో ఈ సారి భాస్కర్ .... 

1 కామెంట్‌: