13, నవంబర్ 2010, శనివారం
తొలి కంద పద్య శాసన స్థలంబొమ్మలమ్మ గుట్ట దగ్గర తెలంగాణా కవిత 2009 ,కావడి కుండలు కవిత సంకలనాల ఆవిష్కరణ
కరీంనగర్ సాహితి సోపతి,ఆలగడప తెలంగాణా మట్టి మనుషులు కలిసి నవంబర్ 7 న కరీంనగర్ దగ్గర కురిక్యాల లోని తొలి కంద పద్య శాసన స్థలం దగ్గర తెలంగాణా కవిత 2009 , కావడి కుండలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. క్రీ.శ.946 లో జినవల్లబుడు రాసిన త్రి భాష శాసనం అక్కడ వుంది .జిన్నవల్లబుడు కన్నడ ఆదికవి పంపని సోదరుడు. విశాదమైన సందర్భం ఏందంటే ఆ శాసనము,జైనుల ప్రతిమలు ఉన్న ఆ బొమ్మలమ్మ గుట్టను ఘనత వహించిన( మన ) ప్రభుత్వం గ్రైనేటు వ్యాపారులకు అమ్మే ప్రయత్నం చేస్తంది.దీనికి వ్యతిరేకంగా ఆందోళన మొదలైంది. అందుకే వేనేపల్లి పాండురంగ రావు నేను సుంకర రమేష్ నలిమెల భాస్కర్ అక్కడ కవులు రచయితలతో పుస్తక ఆవిష్కరణ యాత్ర ఈర్పాటు చేసినం. మలయ శ్రీ, జూకంటి జగన్నాధం నాళేశ్వరం శంకరం వి. ఆర్ .శర్మ ఇంకా కరీంనగర్ హైదరాబాద్ కామారెడ్డి హుస్నాబాద్ నుంచి స్థానిక ఉద్యమ కారులు ఉప్పు లింగయ్య సర్పంచ్ రాజిరెడ్డి ఇంకా సాహితి సోపతిగల్లు పాల్గొన్నారు.తెలంగాణా ప్రాచీన చరిత్ర వనరులను ద్వంసం ను అందరు ఖండించాలే...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
mee prayatnam safaleekrutam kaavaalani aakaamkshistu..
రిప్లయితొలగించండి