30, జులై 2010, శుక్రవారం

జయ జయ తెలంగానం

తెలంగాణా తెగతెంపులు చేసుకునే కొట్లాట.యాబై మూడేండ్ల నుంచి తెలంగాణా ప్రజలు అన్ని రకాల దోపిడీ కి గురయ్యారు .ఇది సమస్త తెలంగాణా ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యింది .కానీ ఇక్కడి రాజకీయ నాయకులు ఆంధ్ర వలస వాదుల చెప్పు చేతల్లోనే ఉన్నారు .అందుకే ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో భలే బుడ్డి జెప్పిండ్రు .తెలంగాణా ఉద్యమం లో రాజీనామా చేసిన వాళ్లనే మల్ల గెలిపిచిండ్రు. ఇది ఉద్యమ విజయమే .ముఖ్యంగా కాంగ్రెస్ తెలుగు పార్టీలు సిగ్గు పడాల్సిన సమయం .తెలంగాణా కొరకు ప్రణబ్ ముకర్జి కమిటి, శ్రీకృష్ణ కమిటి లు ఏసిన కాంగ్రెస్ పార్టినే ఆ కమిటిలకు రిపోర్ట్ ఇయ్యలేదు తెలుగు దేశం అంతే .ఇక తెలంగాణా మేమే తెస్తాం అని మాట్లాడిన మాటలన్నీ ఎతులని నమ్మి ఎవలకు వోటు వెయ్యలనో వాళ్ళకే పట్టం గట్టిండ్రు .ఇక రానున్న రోజుల్లో భారత రాజ్యాంగం ప్రజల ఆకాంక్షల ను నేరవేర్చేదిగా ఉందొ లేదో నిరుపించుకోవలె .తెలంగాణా వోటర్లకు ఉద్యమ శుభాకాంక్షలు

1 కామెంట్‌: