4, ఆగస్టు 2011, గురువారం

అనువాద కవితా సంకలనం 'ఫార్మ్లాండ్ ఫ్రాగ్రన్స్' ఆవిష్కరణ విశేషేశాలు

నా అనువాద కవితా సంకలనం 'ఫార్మ్లాండ్ ఫ్రాగ్రన్స్' ఆవిష్కరణ 31 .7 . 2011 న హైదరాబాద్ లోని సిటి సెంట్రల్ లైబ్రరి లో జరిగింది .పి.జయలక్ష్మి తెలుగు నుంచి ఆంగ్లం లోకి అనువదించారు .వసంత కన్నబీరన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు .నమస్తే తెలంగాణా సంపాదకులు అల్లం నారాయణ అధ్యక్షత వహించారు.తెలుగు విశ్వ విద్యాలయం మాజీ ఉప కులపతి ప్రో ,యన్.గోపి , ఆంధ్రజ్యోతి సంపాదకులు కే .శ్రీనివాస్ .సీఫెల్ విద్యాలయం ప్రో .లక్ష్మి హరిబండి,తెలంగాణా రచయితల వేదిక అధ్యక్షులు జూకంటి జగన్నాధం ,  పి.జయలక్ష్మిలు పాల్గొన్నారు .సమావేశములో అనువాదకులు ,తెలంగాణా వాదులు ,జర్నలిస్ట్లు లు ,పలువురు సాహిత్య ప్రముఖులు హాజరయ్యారు.ఈ సభను కరీంనగర్ "సాహితీ సోపతి "నిర్వహించింది .