30, జులై 2010, శుక్రవారం

జయ జయ తెలంగానం

తెలంగాణా తెగతెంపులు చేసుకునే కొట్లాట.యాబై మూడేండ్ల నుంచి తెలంగాణా ప్రజలు అన్ని రకాల దోపిడీ కి గురయ్యారు .ఇది సమస్త తెలంగాణా ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యింది .కానీ ఇక్కడి రాజకీయ నాయకులు ఆంధ్ర వలస వాదుల చెప్పు చేతల్లోనే ఉన్నారు .అందుకే ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో భలే బుడ్డి జెప్పిండ్రు .తెలంగాణా ఉద్యమం లో రాజీనామా చేసిన వాళ్లనే మల్ల గెలిపిచిండ్రు. ఇది ఉద్యమ విజయమే .ముఖ్యంగా కాంగ్రెస్ తెలుగు పార్టీలు సిగ్గు పడాల్సిన సమయం .తెలంగాణా కొరకు ప్రణబ్ ముకర్జి కమిటి, శ్రీకృష్ణ కమిటి లు ఏసిన కాంగ్రెస్ పార్టినే ఆ కమిటిలకు రిపోర్ట్ ఇయ్యలేదు తెలుగు దేశం అంతే .ఇక తెలంగాణా మేమే తెస్తాం అని మాట్లాడిన మాటలన్నీ ఎతులని నమ్మి ఎవలకు వోటు వెయ్యలనో వాళ్ళకే పట్టం గట్టిండ్రు .ఇక రానున్న రోజుల్లో భారత రాజ్యాంగం ప్రజల ఆకాంక్షల ను నేరవేర్చేదిగా ఉందొ లేదో నిరుపించుకోవలె .తెలంగాణా వోటర్లకు ఉద్యమ శుభాకాంక్షలు

29, జులై 2010, గురువారం

వల్లుబండ వొక అనుభవం

రీంనగర్ జిల్లా తెలంగాణా ఉద్యమ కవితా సంకలనం తీసుక రావాలని ఆలోచనఅన్దిచింది మొట్ట మొదట అనిశెట్టి రజిత. మార్చ్ 21 2010 హనమకొండరాజరాజనరేంద్ర ఆంధ్ర భాషానిలయంలో 'తెలంగాణా జంగ్' ఉద్యమ కవితాసంకలనం విడుదల సభ జరిగింది. (నల్లెల్ల రాజయ్య సంపాదకుడు ) అదే రోజువరంగల్లు లో కవితా వార్షిక 2009 విడుదల సభకు పోయిన నేను సాయంత్రంతెలంగాణా జంగ్ లో పాల్గొన్న .అక్కడే ఉన్నరజిత మీ కరీంనగర్ నుంచి కుడా తీయలె సంకలనం అని ఎగిర పెట్టింది .సరే నని నేనుజూకంటి జగన్నాధం ,నలిమెల భాస్కర్ ఇంకా కొంత మంది మిత్రులం కల్సినిర్ణయానికి వచ్చినం .ప్రకటన ఇయ్యగానే మస్తు కవిత్వం వచ్చింది అన్ని వేయలనుకొని పైసల కోసంతిప్పల పడుతున్న క్రమం లో పది మంది మూడు వెయ్యిలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిండ్రు .(వాళ్ళు వల్లుబండకు ప్రాణవాయువులు అయ్యిండ్రు . వాళ్ళు నలిమెల భాస్కర్ పాలిగ్లాట్ ,వానమాల చంద్రశేఖర్ రచయిత ,నగునూరి శేఖర్ జర్నలిస్ట్ ,అలుగోజు కుమార స్వామిముదుగంటి సుధాకర్ రెడ్డి సోషల్ వర్కర్ ,మల్యాల వరద శేషయ్య ,సంగెవేనిరవీంద్ర కవి ముంబై ,రాచెర్ల వెంకన్నతెలంగాణా వాది , తానిపర్తి తిరుపతి రావుతెలంగాణా వాది ,అన్నవరం రాజేశ్వరి టీచర్ .
ఇంకా ఏందరో వెలువడడానికి సహకరిచిండ్రు అందరికి వందనాలు.
పుస్తకం వెలువరించడం మంచి సంతృప్తినిచ్చిన అనుభవం

,